సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మొదటి రోజు భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్రావు సంఘీభావం తెలిపారు. రైతులకు అందిస్తున్న రైతు బీమా లాగానే ప్రతి చేనేత కార్మికునికి రూ. ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని రఘునందన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల దీక్షకు రఘునందన్రావు మద్దతు - raghunandan rao agrees to handloom workers protest at dubbaka
తమ సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్రావు సంఘీభావం తెలిపారు. ఏపీలో ఇస్తున్నట్లు నేతన్నలకు చేనేత బంధు పథకాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రఘునందన్రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న చేనేత బంధు పథకాన్ని తెలంగాణలోనూ కేసీఆర్ సర్కారు వెంటనే అమలు చేయాలని రఘునందన్రావు కోరారు. ప్రతి చేనేత కుటుంబానికి వ్యాపార అభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలన్నారు.
ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్లు: కేసీఆర్