సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఓ రైతు.. తన పొద్దు తిరుగుడు పంటను పక్షుల బెడద నుంచి తప్పించడానికి వినూత్నంగా ఆలోచించాడు. పూలలో ఉండే గింజలను పక్షులు తినకుండా వాటికి కవర్లు చుట్టి ఉంచాడు. పంటకు నష్టం జరగకుండా కాపాడుకుంటున్నాడు.
పట్టణానికి చెందిన బత్తుల రవీందర్.. శివారులోని 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పంటను సాగు చేశాడు. సాధారణంగా పొద్దు తిరుగుడుకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. పూలలో విత్తనాలు తయారయ్యే లోపు పక్షులు వాలి వాటిని తినేస్తుంటాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించినట్లు రవీందర్ తెలిపారు.