తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 10:30 PM IST

ETV Bharat / state

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

మరో వేములవాడగా బాసిల్లుతున్న పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఈవోగా విశ్వనాథ శర్మను నియమించారు.

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేస్తూ... ఆ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారిగా విశ్వనాథ శర్మ... ఎండోమెంట్​ ఇన్​స్పెక్టర్​ రంగారావు, సర్పంచి దేవసాని సుశీల రాజిరెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు నర్సింహాచార్యులు, ప్రధానార్చకులు నర్సింహా మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

ABOUT THE AUTHOR

...view details