తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా రెండో రోజు సమ్మె.. నష్టాల్లోకి ఆర్టీసీ

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లకు తీసుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది.

By

Published : Oct 6, 2019, 5:47 PM IST

సిద్దిపేటలో ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకున్న ఆర్టీసీ

సిద్దిపేట డిపోలో తాత్కాలికంగా 60 మంది డ్రైవర్లు, 60 మంది కండక్టర్లను తాత్కాలికంగా నియమించారు. డ్రైవర్​కు రూ.1500, కండక్టరుకు రూ.1000 వేతనం ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకుంది. సమ్మె ముందు సిద్దిపేట డిపోకు 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని.. నిన్న ఒక్క రోజే కేవలం రెండు లక్షల ఐదువేల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ స్పష్టం చేసింది. డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంచామని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.

సిద్దిపేటలో ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకున్న ఆర్టీసీ
ఇవీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి

ABOUT THE AUTHOR

...view details