తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు మంత్రి హరీశ్​రావు పాసుపుస్తకాలు పంపిణీ - మంత్రి హరీశ్​రావు పాసుపుస్తకాలు పంపిణీ

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బాలాజీ ఫంక్షన్​ హాల్​లో 242 మంది లబ్ధిదారు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి హరీశ్​రావు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకూడదని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.

passbook distribution at siddipet by  minister harish rao
రైతులకు మంత్రి హరీశ్​రావు పాసుపుస్తకాలు పంపిణీ

By

Published : Jun 18, 2020, 7:26 PM IST

కరోనా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి, చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోళ్లు చేసిన వారం రోజుల్లోపే రైతులకు బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బాలాజీ ఫంక్షన్​ హాల్​లో 242 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.

కొవిడ్​ వచ్చి దేశమంతా చాలా ఇబ్బంది పడిందని... బిహార్​, ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రాల నుంచి మొక్కజొన్నలు, వడ్లు తెచ్చినా.. తెలంగాణ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. ప్రతి రెండు, మూడు గ్రామాల్లో కొనుగోళ్లు కేంద్రాలు పెట్టి, టార్పాలిన్​ కవర్లు పెట్టి ఎక్కడా రైతులు ఇబ్బందులు రాకుండా పండిన పంటను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:940 కేజీల గంజాయి పట్టివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details