తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్డి జేఏసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర - రెడ్డి జేఏసీ జిల్లా ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రెడ్డి జేఏసీ జిల్లా ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్రకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వైపు పాదయాత్ర కొనసాగించారు. ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని జాతీయ నాయకులు కేశవరెడ్డి డిమాండ్ చేశారు.

Padayatra under the auspices of Reddy JAC District United Platform at Bejjanki Mandal in Siddipet District
రెడ్డి జేఏసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర

By

Published : Jan 24, 2021, 7:34 PM IST

ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఇందుకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వైపు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం బెజ్జంకి చేరుకున్నారు.

ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేశవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిరుపేద అగ్రకులాలకు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రామలింగారెడ్డి, అధ్యక్షులు ఐలేని మల్లికార్జున రెడ్డి, అధ్యక్షురాలు శశికళ, రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ రెడ్డి, మండల అధ్యక్షులు ముక్కిస తిరుపతిరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details