తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు ఎరువులు పంచిన పీఎసీఎస్ ఛైర్మన్​ - మిరుదొడ్డి మండలంలో ఎరువుల పంపిణీ

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో పీఎసీఎస్​ ఛైర్మన్​ బక్కి వెంకటయ్య రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. మండలంలోని అల్వాల గ్రామంలోని రైతులకు సబ్సిడీపై ఎరువులు అందించారు. లాక్​డౌన్​ కారణంగా రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడకుండా సబ్సిడీలో ఎరువులు అందిస్తున్నట్టు తెలిపారు.

PACS Chairman Distributes Fertilizers To Formers in Mirudoddi
రైతులకు ఎరువులు పంచిన పీఏసీఎస్ ఛైర్మన్​

By

Published : May 19, 2020, 9:50 AM IST

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామంలో రైతులకు పీఎసీఎస్ ఛైర్మన్​ బక్కి వెంకటయ్య ఎరువులు అందించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా రైతులు ఎరువుల కొరత వల్ల ఇబ్బంది పడకుండా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నట్టు తెలిపారు.

రైతులుకు ముందస్తుగానే.. ఎరువులు అందించి.. వారిని పంటసాగుకు సిద్ధం చేసే దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వానాకాలానికి సరిపడా ఎరువులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్​ ఎంపీపీ పోలీస్​ రాజు, సర్పంచ్​ కిష్టయ్య, కో ఆప్షన్​ సభ్యుడు హైమద్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details