తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

సిద్దిపేట జిల్లా విశ్వనాథపల్లి శివారు వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Dec 27, 2019, 4:23 PM IST

accident
కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నంగనూరు మండలం రాజగోపాల్​పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్​కి బయలుదేరారు.

విశ్వనాథపల్లి వద్దకు రాగానే కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజగోపాల్​పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details