తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

ఆదివారం కదాని సరదాగా ఈతకు వెళ్దామని వెళ్లాడు. చెరువులోకి దిగి చాలా సేపు ఈత కొట్టాడు. ఇంకో రెండు నిమిషాల్లో బయటకు వచ్చేస్తాడనుకునేలోపే... ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయి మృతి చెందాడు.

By

Published : Sep 30, 2019, 3:57 PM IST

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్నబోయిన అరుణ్ ఆదివారం సరదాగా ఈతకోసమని గిద్దకుంట చెరువుకు తన చెల్లితో కలిసి ఈతకు వెళ్లాడు. చెరువు చివరనున్న వారి బంధువుల వద్దకు అరుణ్ తన చెల్లెలు రక్షితను పంపాడు. అరుణ్ మాత్రం ఈత కోసం కుంటలో దూకాడు. ఈత కొడుతూ కుంట చివరికి చేరే సమయంలో ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. రెండు నిమిషాలలో గడ్డకు చేరేలోపే అరుణ్ అందరూ చూస్తూ ఉండగా కుంటలో మునిగిపోయాడు. అరుణ్ కోసం రాత్రి వరకు గాలించారు. గజ ఈతగాళ్లను రప్పించి చేపల వలతో వెతికారు. చివరకు రాత్రి 12 గంటల సమయంలో అరుణ్ శవమై వలకు చిక్కాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details