లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు మద్యం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని రాజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ఆబ్కారీ అధికారులు భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్న అధికారులు - సిద్దిపేట జిల్లాలో భారీగా నల్లబెల్లం స్వాధీనం
లాక్డౌన్తో మద్యం దుకాణాలు మూతపడటంతో అక్రమ మద్యం తయారీ జోరుగా సాగుతోంది. మద్యం తయారీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన నల్లబెల్లాన్ని సిద్దిపేట జిల్లాలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్న అధికారులు nallabellam seized in siddipetq](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6985128-699-6985128-1588146500245.jpg)
భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్న అధికారులు
మండలంలో నాటుసారా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు గ్రామాలలో సోదాలు చేయగా.. పోతారంలో 20 క్వింటాళ్ళ నల్ల బెల్లం డంపు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. బెల్లాన్ని స్వాధీనం చేసుకుని రాజి రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం