తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 7:42 PM IST

ETV Bharat / state

వైశ్యభవన్‌లో ఘనంగా మృత్యుంజయ హోమం

రాష్ట్ర ప్రజలంతా కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని ప్రార్థిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వైశ్యభవన్‌లో మృత్యుంజయ హోమం నిర్వహించారు. బెజ్జంకి మానసదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

homam
homam

కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలంతా త్వరగా బయటపడాలని ప్రార్థిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వైశ్యభవన్‌లో మృత్యుంజయ హోమం నిర్వహించారు. బెజ్జంకి మానసదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ సతీ సమేతంగా హాజరై అమ్మవారి అనుగ్రహం పొందారు.

లోక కల్యాణార్థం హోమాలను జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా బాధలు త్వరగా తొలగిపోయి ప్రజలంతా సుఖ శాంతులతో ఆనందంగా గడుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:CM TOUR: కామారెడ్డిలో సీఎం పర్యటన... నూతన కలెక్టరేట్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details