తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సమయంలోనే పథకాల అమలులో రాజీ లేదు: ఎమ్మెల్యే - లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన లబ్దిదారులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెక్కులు అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధికి చెందిన చెక్కులను 29 గ్రామాల వారికి ఇచ్చారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

By

Published : Jul 13, 2020, 10:09 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని 29 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పథకాలు చేపడుతోందన్నారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆర్థికసాయం అందిస్తూ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details