సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి సందర్శించారు. రైతుబజార్లో అన్ని దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో మాట కలిపారు. వారి బాగోగులు.. కూరగాయల ధరలు.. తదితరాలపై వారితో ముచ్చటించారు. కూరగాయలు, చేపలు కొనుగోలు చేశారు. మంత్రుల రాకతో మార్కెట్ సందడిగా మారింది.
సిద్దిపేట రైతు బజారులో మంత్రుల సందడి
సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ప్రత్యేక అతిథిలు విచ్చేశారు. రైతు బజారులో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి సందడి చేశారు. సరదాగా కాసేపు వ్యాపారస్తులతో ముచ్చటించి.. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేట రైతు బజారులో మంత్రుల సందడి
Last Updated : Nov 17, 2019, 11:28 PM IST