తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొండపోచమ్మ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి' - Ministers review on kondapochamma temple

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంతోపాటు కొండ పోచమ్మ దేవాలయం అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొండపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు... ఆలయాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

'కొండపోచమ్మ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి'
'కొండపోచమ్మ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి'

By

Published : Feb 1, 2021, 3:36 PM IST

సిద్దిపేట జిల్లా తీగుల్ నర్సాపూర్​లోని కొండపోచమ్మ ఆలయానికి కేటాయించిన నిధులతో అభివృద్ధి చేయాలని మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వేద పండితులు వాస్తు నిపుణులతో సంప్రదించి అద్భుతంగా ఆలయాన్ని రూపొందించాలని సూచించారు.

తిరుమల, యాదాద్రి తరహాలో కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మల్లన్న ఆలయం వద్ద భక్తులకు వసతి కోసం గదుల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రహదారి నిర్మాణానికి గతంలో మంజూరైన నిధులకు అదనంగా మరో మూడు కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్​రాంరెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు అన్నపూర్ణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

అమ్మవారి ఆలయంలో హరీశ్​రావు

ఇదీ చదవండి :'ఆరు కీలక అంశాల ఆధారంగా బడ్జెట్​ ప్రతిపాదనలు'

ABOUT THE AUTHOR

...view details