తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 6:06 PM IST

ETV Bharat / state

సమీకృత మార్కెట్​ను పరిశీలించిన నిరంజన్ రెడ్డి

సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్​లో ప్రారంభించనున్న సమీకృత మార్కెట్​ను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. నవీన పద్ధతుల్లో ఏర్పాటు చేసిన మార్కెట్​ను ఏర్పాటు చేయటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET
MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పర్యటించారు. సీఎం కేసీఆర్​ రేపు ప్రారంభించనున్న సమీకృత మార్కెట్​ను మంత్రి పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రయవిక్రయాలు క్రమ పద్ధతిలో జరిగే విధంగా మార్కెట్​ను ఏర్పాటు చేసినట్లు నిరంజన్​రెడ్డి తెలిపారు. బహుముఖ ప్రయోజనాలతో కూడిన మార్కెట్​ను నిర్మించటం హర్షనీయమని కొనియాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.

సమీకృత మార్కెట్​ను పరిశీలించిన మంత్రి...

ABOUT THE AUTHOR

...view details