తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​ - మంత్రి హరీశ్​రావు తాజా వార్తలు

సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలల​ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలవాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. పట్టణంలోని టీటీసీ భవన్​లో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Minister Harish suggested to techers that Better results in Inter
ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​

By

Published : Dec 7, 2019, 9:43 AM IST

సిద్దిపేట జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని... ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్​లో ప్రభుత్వ జూనియర్​ కళాశాలల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

మరోవైపు ఇంటర్​ విద్యార్థుల్లో 65 శాతం మంది మాత్రమే పాసవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు స్నేహితులతో... సామాజిక మాధ్యమాలలో కాలం గడుపుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు.

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యేలా కళాశాలల అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​

ఇదీ చూడండి : మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details