సిద్దిపేట మున్సిపల్ ఆరో వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈనెల 15న సిద్దిపేటలో కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభిస్తామని చెప్పారు. చిట్కాలు పాటించి కరోనా బారి నుంచి మనల్ని మనమే కాపాడుకుందామని మంత్రి అన్నారు.
చిన్నచూపు వద్దు
కరోనా సోకిన వారిపై ప్రేమను చూపాలని మంత్రి కోరారు. వారిని సమాజంలో చిన్నచూపుగా చూడొద్దని.. అలా చేయడం తప్పని చెప్పారు. కరోనా రావాలని.. ఎవరూ కోరుకోరని, రాకుండా అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. కరోనా వస్తే చేయరాని నేరం, ఘోరం చేసినట్లు, సామాజికంగా బహిష్కరించడం సరికాదన్నారు.