రోజురోజుకు దుబ్బాక నియోజకవర్గంలో భాజపా ఖాళీ అవుతోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకుని భాజపా... రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ధర్మాజీపేట, హబ్సీపూర్ గ్రామాల భాజపా నాయకులు, యువకులు హరీశ్రావు సమక్షంలో తెరాసలో చేరారు.
'అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోంది' - dubbaka updates
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ధర్మాజీపేట, హబ్సీపూర్ గ్రామాల భాజపా నాయకులు, యువకులు మంత్రి హరీశ్రావు సమక్షంలో తెరాసలో చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో భాజపా ఖాళీ అవుతోందని... అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని హరీశ్రావు ఆరోపించారు.

బీడీ కార్మికులకు పదహారు వందలు ఇస్తున్నట్లు భాజపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 16 పైసలైనా ఇచ్చినట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్న యూపీలో వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం రూ. 500 ఇస్తోందని... కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లోనూ రూ. 500 ఇస్తోందని... తెలంగాణలోనే రూ. 2,000 ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాంటిది తెరాస ప్రభుత్వాన్ని కాంగ్రెస్, భాజపా ఎలా విమర్శిస్తారని హరీశ్రావు ప్రశ్నించారు.