తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతీ పేదవానికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'

సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ రెండో విడత లబ్ధిదారులకు మంత్రి హారిశ్​రావు... ఇంటి కేటాయింపు ధ్రువపత్రాలు అందజేశారు. పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. పేదల మీద ప్రేమతో.. సొంతింటి మాదిరిగా మనసు పెట్టి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేశామని హరీశ్ రావు తెలిపారు.

By

Published : Dec 17, 2020, 3:43 AM IST

Updated : Dec 17, 2020, 4:14 AM IST

minister harish rao distributed double bed room house in siddipet
minister harish rao distributed double bed room house in siddipet

'ప్రతీ పేదవానికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'

గూడు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ రెండో విడత లబ్ధిదారులకు ఆయన ఇంటి కేటాయింపు ధ్రువపత్రాలు అందజేశారు. పేదల మీద ప్రేమతో.. సొంతింటి మాదిరిగా మనసు పెట్టి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేశామని హరీశ్ రావు తెలిపారు.

పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. బస్తీ దవాఖానా వచ్చే వరకు తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ నగర్ కు ఆర్టీసీ బస్సు, బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను అమ్మినా, అద్దెకు ఇచ్చినా.. తిరిగి స్వాధీనం చేసుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'పాతబస్తీలో ఆలయ భూముల పరిరక్షణకు 24గంటల డెడ్​లైన్'

Last Updated : Dec 17, 2020, 4:14 AM IST

ABOUT THE AUTHOR

...view details