తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది: మంద కృష్ణ - కేసీఆర్​పై మంద కృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు హాజరై సంఘీభావం తెలిపారు. వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది

By

Published : Nov 2, 2019, 7:25 PM IST

ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపట్టకపోతే... కేసీఆర్​ ప్రగతి భవన్​ వీడి ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సివస్తుందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​-ప్రజ్ఞాపూర్​ డిపో వద్ద​ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని చెప్తున్న కేసీఆర్​... ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాన్ని చూసైన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. దినదిన గండంగా బతుకుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి... ప్రభుత్వాన్నిబేషజాలు వీడాలని కోరారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details