తెలంగాణ

telangana

హరీశ్​రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ

By

Published : Oct 24, 2019, 1:22 PM IST

సమస్యలపై వెంటనే స్పందించే మంత్రి హరీశ్​రావు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎందుకు మౌనం వహించారో తెలపాలని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్​ చేశారు. కార్మిక నాయకుడిగా వ్యవహరించిన హరీశ్​కు ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు.

హరీశ్​రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ

ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో గత 20 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ సంఘీభావం తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. అన్ని సమస్యలపై స్పందించే మంత్రి హరీశ్​ ఆర్టీసీ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. హరీశ్​రావు కార్మికుల పక్షమా.. లేక కేసీఆర్​ పక్షమా తేల్చుకోవాలన్నారు. పదవులు శాశ్వతం కాదని ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

హరీశ్​రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details