తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడిసెలో వైరు సరిచేస్తూ.. విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి! - Man Died With Electric Shock In Siddipet

ఈదురు గాలులు, వర్షానికి గుడిసెలో విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల వైరు సరి చేస్తూ విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ యజమాని కరెంట్​ షాక్​తో అకాల మరణం చెందడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Man Died With Electric Shock In Siddipet
గుడిసెలో వైరు సరిచేస్తూ.. విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి!

By

Published : Aug 28, 2020, 11:59 AM IST

సిద్ధిపేట జిల్లా రూరల్​ మండలం రాఘవాపూర్​ గ్రామ శివారులో విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తుమ్మల రాజేందర్​ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామ శివారులోని పూరి గుడిసెలో నివాసముంటున్నారు. మామిడి కాయలు, పండ్లు, మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. గురువారం నాటి ఈదురు గాలులు, వర్షానికి వారు ఉండే గుడిసెలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కరెంటు బాగు చేస్తానంటూ రాజేందర్​ వైరు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్​ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేందర్​ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details