సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన మాదాసు శ్రీనివాస్ భార్య అన్నపూర్ణను గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హైదరాబాద్ లో నియామక పత్రాన్ని అందజేశారు.
ఉద్యమ కారులకు గుర్తింపు..
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో మాదాసు శ్రీనివాస్ విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు నమ్మినబంటుగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలోనే రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ మహిళలకు కేటాయించారు. చాలా మంది పోటీ పడినప్పటికీ అన్నపూర్ణకు అవకాశం వరించింది.
ఇదీ చూడండి:'పోలీసులా..? కల్వకుంట్ల సైన్యమా..?