తెలంగాణ

telangana

ETV Bharat / state

భూవివాదం.. కర్రలు, గొడ్డళ్లతో దాడి - land issue at lingareddypally siddipet

భూవివాదంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

land issues Attack with firewood and axes at lingareddypally
భూవివాదం.. కట్టెలు, గొడ్డళ్లతో దాడి

By

Published : Jul 22, 2020, 5:38 PM IST

భూమి పంచాయతీ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు... అది కాస్తా కర్ర లు గొడ్డళ్లతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. వివారాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లిలో తిప్పతీ నీలమ్మ, భర్త కొండయ్యలు నివసించేవారు. సంగుపల్లిలో భోగమల్ల కనకరాజు, తండ్రి ఎల్లయ్య ఉండేవారు. వారిరువురు లింగారెడ్డిపల్లిలోని భూమి పంపకం విషయంలో ఒకరికొకరు తగాదా పడ్డారు.

భూవివాదం.. కట్టెలు, గొడ్డళ్లతో దాడి

ఒకరిపై ఒకరు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకోగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాయపోల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :కర్నల్​ సంతోష్​ భార్యకు డిప్యుటీ కలెక్టర్​గా ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details