తెలంగాణ

telangana

ETV Bharat / state

డిపోల్లోనే బస్సులు.. ఇళ్లలోనే ఉద్యోగులు! - siddipet didtrict latest news

సామాన్యుడి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు ‘లాక్‌డౌన్‌’లో ఉంది. బస్సులు రోడ్లెక్కేది మేలోనా, జూన్‌లోనా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని ఐదు ఆర్టీసీ డిపోల పరిధిలో రూ.కోట్లల్లో ఆదాయం పోయింది. డిపోలను, బస్సులను, వాటి ఇంజిన్లు, బ్యాటరీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ కొందరు సిబ్బందితో అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడు విధుల్లో చేరమని చెప్పినా బస్సులతో సహా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొన్ని బస్సులను వలస కార్మికులు, ‘కరోనా’తో పోరాటం చేస్తున్న సిబ్బందిని తరలించేందుకు వినియోగిస్తున్నారు.

siddipet district rtc latest news
siddipet district rtc latest news

By

Published : May 7, 2020, 12:13 PM IST

సిద్దిపేట డిపోలో మొత్తం 115 బస్సులు ఉన్నాయి. 54 ఆర్టీసీ, 61 అద్దె బస్సులున్నాయి. 380 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఈ డిపోలో రూ.5.28 కోట్లు ఆదాయం కోల్పోయింది.

బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా వాటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. మూడు రోజులకోసారి మెకానిక్‌లు బస్సు సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. బ్యాటరీల నిర్వహణ, టైర్లలో గాలిని తనిఖీ చేస్తున్నారు. రోజువారీగా షిఫ్టుల పద్ధతిలో ఐదుగురు సిబ్బంది వస్తున్నారు. పది మంది డ్రైవర్లను అత్యవసరానికి సిద్ధంగా ఉంచుతున్నారు. వలస కార్మికుల తరలింపుపై ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తేనున్నామని డిపో మేనేజర్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

20 బస్సుల కేటాయింపు...

తెలంగాణ నుంచి వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఇందుకుగాను గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపో నుంచి 20 బస్సులు కేటాయించారు. హకీంపేటలో రిపోర్టు చేయగా అక్కడి నుంచి ఏ ప్రాంతాలకు వెళ్లేది అధికారులు నిర్ణయిస్తారని డిపో అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.3.60 కోట్ల ఆదాయాన్ని ఈ డిపో కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details