తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - మిరుదొడ్డిలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

krishnashtami celebrations at mirudoddi
మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Sep 11, 2020, 5:07 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక వేడుకలు జరిపారు. స్వామివారికి అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకం, అర్చన, అలంకరణ, ఊంజల్​ సేవ నిర్వహించారు.

కొవిడ్​ నేపథ్యంలో భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపిక వేషధారణలో ప్రత్యేక నృత్య గీతాలతో అలరించారు. వేడుకల్లో గ్రామపెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు, 13 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details