సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక వేడుకలు జరిపారు. స్వామివారికి అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకం, అర్చన, అలంకరణ, ఊంజల్ సేవ నిర్వహించారు.
మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - మిరుదొడ్డిలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు
శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ కట్టడిలో భాగంగా భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
![మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు krishnashtami celebrations at mirudoddi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8763871-719-8763871-1599823424740.jpg)
మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కొవిడ్ నేపథ్యంలో భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపిక వేషధారణలో ప్రత్యేక నృత్య గీతాలతో అలరించారు. వేడుకల్లో గ్రామపెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.