తెలంగాణ

telangana

'పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి'

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.

By

Published : Oct 25, 2019, 6:36 PM IST

Published : Oct 25, 2019, 6:36 PM IST

సిద్దిపేటలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

సిద్దిపేటలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల విషయంలో అవకతవకలకు ఆస్కారం లేదని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మల్లన్న సాగర్​ ప్రాజెక్టు పూర్తయ్యాక... దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details