తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్ కు చేరుకున్న కాళేశ్వరం గోదావరి నీళ్లు - Kaleshwaram waters to reach Kondapochamma dam by ..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు కాళేశ్వరం గోదావరి నీళ్లు చేరుకున్నాయి. నిన్న తుక్కపూర్ లోని పంప్ హౌజ్ ద్వారా మల్లన్న సాగర్ మొదటి పంప్ ద్వారా అధికారులు నీటి విడుదల చేశారు.

Kaleshwaram Godavari water that reaches Gazwel
గజ్వేల్ కు చేరుకున్న కాళేశ్వరం గోదావరి నీళ్లు

By

Published : May 13, 2020, 2:36 PM IST

కాళేశ్వరం గోదావరి నీళ్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చేరుకున్నాయి. నిన్న తుక్కపూర్ లోని పంప్ హౌజ్ ద్వారా మల్లన్న సాగర్ మొదటి పంప్ ద్వారా అధికారులు నీటి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ జలాశయంకు చెందిన తుక్కపూర్ పంప్ హౌస్ మొదటి పంప్ ద్వారా... కొండపోచమ్మ జలాశయంకు సంబంధించిన గజ్వేల్ మండలం అక్కరం పంప్ హౌజ్ కు అధికారులు నీటిని విడుదల చేశారు.

ఆ నీళ్లు ఇవాళ గజ్వేల్ మండలానికి చేరుకున్నాయి. కోడకండ్ల దాతర్ పల్లి మధ్యలో ఏర్పాటు చేసిన పంప్ హౌస్ రెగ్యులేటర్ వద్ద అధికారులు నీటి ఆపారు. రెగ్యులేటర్ ద్వారా నీటిలోని చెత్తను తీసివేసి అక్కడి నుంచి అక్కారం పంప్ హౌజ్ సర్జి పూల్ కు నీటిని పంపిస్తారు. ఇక్కడి నుంచి ఈ వారంలో కొండపోచమ్మ జలాశయం కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:పసివాడి వైద్యం కోసం 100 కి.మీ. నడక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details