తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది' - JAC president manjula reddy helped private teachers in husnabad

ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిత్యం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒక గురువు అవసరం ఉంటుందని అలాంటి గురువులకు కరోనా ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టిందని జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు కర్ణకంటి మంజులా రెడ్డి అన్నారు. అలా కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

JAC Telangana state president helped private teachers in husnabad
సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూత

By

Published : Sep 5, 2020, 5:51 PM IST

సోషల్ మీడియాలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ఉపాధ్యాయుడు యామ రాజు చేపట్టిన రైస్ బ్యాగ్ ఛాలెంజ్​కు దాతలు స్పందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వీఎల్ రెడ్డి ఫంక్షన్ హాల్​లో... హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 125 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు, మాస్కులను పంపిణీ చేశారు.

ఉపాధ్యాయులకు సరకుల పంపిణీ

రెండు లక్షల రూపాయలతో ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులను జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులారెడ్డి అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు రైస్ బ్యాగ్ ఛాలెంజ్​కు స్పందించిన దాతలందరికీ అభినందనలు తెలిపారు. మూడు మండలాలతో పాటు నియోజకవర్గంలో మిగిలిన 4 మండలాల ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.

భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కీలకమైన ఉపాధ్యాయులు కరోనా వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details