తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వయంభు రాజరాజేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ - శివరాత్రి వేడుకలో పాల్గొన్న హుస్నాబాద్​ ఎమ్మెల్యే

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం పొట్లపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కోడెమొక్కులను చెల్లించుకున్నారు.

Husnabad MLA in the service of Sri Swayambhu Rajarajeswara Swami
స్వయంభు రాజరాజేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

By

Published : Mar 11, 2021, 7:59 PM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో స్వామి వారి ఆశీస్సులు ఉండాలని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ కోరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం పొట్లపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. కోడె మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఎమ్మెల్యే​ను ఘనంగా సన్మానించారు.

చిన్న వేములవాడగా పేరుగాంచిన శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని ఆయన తెలిపారు.

ఇదీ చదంవండి:'ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ'

ABOUT THE AUTHOR

...view details