తెలంగాణ

telangana

ETV Bharat / state

పునరావాస కాలనీలో కూలిన మరో ఇంటి గోడ - మల్లన్నసాగర్‌ బాధితులు

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల కోసం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌ల నాణ్యత విషయంలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ ఇంటి మెట్ల గోడ కూలిపోగా.. తాజాగా మరో ఇంటి గోడ ధ్వంసమైంది. ఘటనపై స్పందించిన అధికారులు మాత్రం.. పూర్తి నాణ్యతా ప్రమాణాలతోనే ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు చెబుతుండటం గమనార్హం.

wall
wall

By

Published : May 19, 2021, 10:30 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన మల్లన్నసాగర్ పునరావాస కాలనీలో.. మరో ఇంటి మెట్ల గోడ కూలిపోయింది. ఘటనా సమయంలో.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా.. వరుసగా 2 ఇళ్లకు సంబంధించిన మెట్ల గోడలు ధ్వంసమవడంతో నిర్వాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎమవుతుందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన అవసరం లేదు: ఆర్డీవో

ఘటనపై స్పందించిన గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి.. పునరావాస కాలనీలోని ఇళ్లు పూర్తిగా ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మితమయ్యాయన్నారు. భూ నిర్వాసితుల కోరిక మేరకు ఇటీవలే మెట్ల కింద అదనపు టాయిలెట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. తొందరగా ఇళ్లను అప్పగించడంతో.. అదనంగా నిర్మించిన టాయిలెట్‌లకు సరిగా క్యూరింగ్ చేయకపోవడంతో గోడలు కూలిపోతున్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాలు.. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరిగాయంటూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

ఇదీ చదవండి:పోలీస్​స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​ 'పెళ్లి' పంచాయితీ

ABOUT THE AUTHOR

...view details