తెలంగాణ

telangana

ఎండుందని ఆరబోస్తే... వానొచ్చి ముంచేసింది...

రోజంతా సూర్యుడి భగభగతో హీటెక్కిపోయిన వాతావరణం... సాయంత్రం కురిసిన వర్షంతో చల్లబడింది. కానీ... ఆ అకాల వర్షం రైతులను మాత్రం నిండా ముంచేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న ధాన్యమంతా వర్షార్పణం కాగా... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Apr 24, 2020, 7:50 PM IST

Published : Apr 24, 2020, 7:50 PM IST

HEAVY RAIN IN GAJWEL NAD PRAGNAPUR MANDALS
ఎండుందని ఆరబోస్తే... వానొచ్చి ముంచేసింది...

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, జగదేవపూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిపోయింది.

నాలుగైదు రోజుల క్రితమే కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా... అధికారులు కొనుగోలు చేయకపోవటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు. అధికారుల అలసత్వం వల్లే తమ ధాన్యం నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.

ఎండుందని ఆరబోస్తే... వానొచ్చి ముంచేసింది...

ఇదీ చూడండి:కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details