తెలంగాణ

telangana

ETV Bharat / state

మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన హరీశ్​రావు - The stall at Farmer's Bazaar was inaugurated by Finance Minister Harish Rao.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి నోరూరించిన చికెన్, మటన్ తొక్కులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. రండి, నాణ్యమైన చికెన్, మటన్, మాంస ఉత్పత్తులు కొనండంటూ.. మన సిద్దిపేటలో మాంస ఉత్పత్తులు ఇవాళ్టి నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం సిద్దిపేట రైతు బజార్​కు రండి. నాణ్యమైన చికెన్, మటన్, మాంస ఉత్పత్తులు కొనండి. ఓసారి టేస్ట్ చేయండి.

Harish Rao, who started the Meat on Wheels vehicle
మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన హారీశ్​రావు

By

Published : Dec 10, 2019, 7:45 PM IST

Updated : Dec 10, 2019, 8:38 PM IST

సిద్దిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని, రైతు బజార్లో స్టాల్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఇర్కోడ్ గ్రామ మహిళలు మాంసం పచ్చళ్లు, మాంసం ఆహార పదార్థాలు క్రయ విక్రయాలు జరిపేందుకు రైతు బజారులో స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా ఈ తొక్కులు అన్నీ చోట్ల ప్రజలకు అందుబాటులో లభించేలా ప్రత్యేక " మీట్ ఆన్ వీల్స్ " వాహనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి అన్నారు.

ప్రతి రోజు ఉదయం ఈ వాహనం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లోకి వెళ్లి మాంసం ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుతుందని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం కోమటి చెరువు, బస్టాండు, జనవాసా రద్దీ ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులు అమ్మడం జరగుతుంది. రాష్ట్రంలో నూటికి 90 మంది మాంసం తింటారని, సెర్ప్ సహకారంతో మహిళలు అదనంగా ఆదాయ వనరులు పొందుతారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ మేరకు మహిళా సంఘాల వద్ద మటన్ పచ్చడి (230 గ్రా) రూ.300లకు మంత్రి హరీశ్​ రావు కొనుగోలు చేశారు.

మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన హరీశ్​రావు

ఇదీ చూడండి : వైద్యం కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్తున్నారా... స్మార్ట్​ఫోన్​ మరచిపోకండి

Last Updated : Dec 10, 2019, 8:38 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details