తెలంగాణ

telangana

ETV Bharat / state

గరీబోల్లకే డబుల్​ బెడ్​రూం ఇళ్లు.. ఆ సంఘటనే నిదర్శనం: హరీశ్​రావు

డబుల్​ బెడ్​రూం ఇళ్లను గరీబోల్లకే కేటాయిస్తున్నామని.. మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. ఈ మధ్య జరిగిన ఓ సంఘటనే అందుకు నిదర్శనమన్నారు. గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

By

Published : Dec 27, 2020, 9:08 PM IST

harish rao
గరీబోల్లకే డబుల్​ బెడ్​రూం ఇళ్లు.. ఆ సంఘటనే నిదర్శనం: హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్​ నగర్​లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. 8వ వార్డు నర్సాపూర్​ కాలనీలో నాలుగో దఫా రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 168 మంది లబ్ధిదారులకు నూతన వస్త్రాలిచ్చి, పట్టాలు అందించారు.

తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లు, పెళ్లికోసం ఆర్థిక సాయం చేస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా, చెమట చిందించకుండా నిరుపేదలకు గూడు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇళ్లను గరీబోల్లకే కేటాయించినట్లు స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో తనపై ఆరోపణలు చేసిన ఓ పార్టీ కార్యకర్తకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు. ఆ వ్యక్తి తనను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. 'డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు దరఖాస్తు చేశానని.. రోజూ మీపై ఆరోపణలు చేస్తుంటానని.. ఇళ్లు కేటాయించరని అనుకున్నానని.. అయినా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇళ్లు కేటాయించారని' చెప్పి ధన్యవాదాలు తెలిపాడు. పారదర్శకంగా పనిచేస్తున్నామనేందుకు ఇదే నిదర్శనం.

- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

అనంతరం డబుల్​ బెడ్​ రూం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు, నూతన వస్త్రాలు అందించారు.

గరీబోల్లకే డబుల్​ బెడ్​రూం ఇళ్లు.. ఆ సంఘటనే నిదర్శనం: హరీశ్​రావు

ఇవీచూడండి:గత సీఎంలకు భిన్నంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారు: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details