తెలంగాణ

telangana

ETV Bharat / state

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు - సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

సిద్దిపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రంథాలయ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

By

Published : Nov 14, 2019, 9:12 PM IST

సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పర్యటించారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తకం ఓ మంచి స్నేహితుడని అన్నారు. పురాతనమైన ఈ గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. 2 కోట్లతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని... వచ్చే మార్చి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని 7 మండలాల్లోనూ గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

సిద్దిపేట నూతన గ్రంథాలయ భవనంలో మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పుస్తకాల కొనుగోలుకు 40 లక్షలు మంజూరు అయినట్లు చెప్పారు. నేటి యువత సెల్​ఫోన్​ మోజులో పడి పుస్తకాలని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ వేలేటి రోజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ లక్కిరెడ్డి ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details