సిద్దిపేటను సశ్యశ్యామలం చేసుకుందాం: హరీశ్రావు - harish rao in siddipeta dasara
" శ్రీరాముని సాక్షిగా చెబుతున్నా.. నా ఊపిరి ఉన్నంతవరకు మీ సేవలో ఉంటా.. మీ రుణం తీర్చుకుంటా.. దేవుని దీవెన, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజలందరీ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చుదిద్దుకుందాం." -హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి
![సిద్దిపేటను సశ్యశ్యామలం చేసుకుందాం: హరీశ్రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4693702-thumbnail-3x2-harish.jpg)
సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి దసరా వేడుకల్లో భాగంగా... రావణ దహనంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు పండి ప్రజల ముఖాల్లో సంతోషం కనబడుతుందన్నారు.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయన్న హరీశ్రావు...త్వరలోనే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలతో దేవుడి పాదాలు కడిగి, ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసుకుందామన్నారు. త్వరలో సిద్దిపేటకు రైలుతో పాటు యువత ఉపాధికి భారీ పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. వచ్చే దసరాకు అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామన్నారు.
- ఇదీ చూడండి : రాజ్భవన్లో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు