శరభేశ్వర ఆలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు
శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవ వేడుకల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.
ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో హరీశ్ రావు
పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చింది తెరాస ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటజిల్లాలోని శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవంలో వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆధునీకరణ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని భక్తులకు ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు.
Last Updated : May 6, 2019, 10:44 PM IST