తెలంగాణ

telangana

'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'

సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి హరీశ్​రావు సమావేశమయ్యారు. 23 సీడ్ కంపెనీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

By

Published : Sep 23, 2020, 4:51 PM IST

Published : Sep 23, 2020, 4:51 PM IST

'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'
'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'

విత్తనోత్పత్తికి ముందుకు వచ్చే విత్తన కంపెనీలకు ప్రజా ప్రతినిధులు, సిద్దిపేట జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. 23 సీడ్ కంపెనీల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

జిల్లాలో 5 లక్షల ఎకరాలు సాగులో ఉండగా... ప్రస్తుతం సీడ్ కార్పొరేషన్ ద్వారా 1,500 ఎకరాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల ద్వారా 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పత్తి, శనగలు, వేరు శనగ విత్తనాలు ఉత్పత్తి జరుగుతోందన్నారు. 25 సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్​లు, 3 కోల్డ్ స్టోరేజ్​లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇటీవలే ఫామ్​ఆయిల్ సాగుకు సైతం సిద్దిపేట జిల్లా అనుకూలమని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. డ్రిప్, ఫామ్ మెకనైజేషన్​కు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: 'వ్యవసాయ బిల్లుతో దేశానికి పొంచిఉన్న ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details