కరోనా మహమ్మారిపై ఓ పండ్ల విక్రయదారుడు వినూత్న రీతిలో అవగాహన కల్పించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వినియోగదారుల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేశారు. 'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో' అంటూ జాగ్రత్తలు తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ అప్రమత్తతో ఉండాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్లకార్డు పెట్టాడు.
'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో' - కరోనా అవగాహన వార్తలు
కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులే కాదు సామాన్యులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ పండ్ల విక్రయదారుడు బోర్డు పెట్టి వినూత్నంగా జాగ్రత్తలు తెలుపుతున్నాడు.
!['వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో' 'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6479109-thumbnail-3x2-d.jpg)
'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'
పండ్ల కోసం వచ్చిన వినియోగదారులకు మాస్క్లు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నాడు. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని బోర్డు ద్వారా జాగ్రత్తలు చెబుతున్నాడు.
'వినియోగదారుడా మేలుకో-ఆరోగ్యం కాపాడుకో'
ఇదీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'