తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో అప్పులపాలైన స్నేహితుడికి మిత్రుల సాయం - Friends help a debtor friend with Corona at siddipeta

కరోనా చికిత్సను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకోని కోలుకొని అప్పులపాలైన తమ మిత్రుడికి, మిత్ర బృందం అండగా నిలిచింది. మొత్తం 1,79,800 రూపాయలను సాయంగా అందించారు.

friends helped corona patient
కరోనాతో అప్పులపాలైన స్నేహితుడికి మిత్రుల సాయం

By

Published : May 19, 2021, 9:23 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన బస్వరాజు రాజశేఖర్​కు గత 20 రోజుల క్రితం కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే సరికి కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వెళ్లాడు. చికిత్స చేయించుకొని కోలుకున్నాడు. చికిత్స నిమిత్తం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. తన ఆర్థిక స్తోమత అంతగా బాలేకపోయినప్పటికీ... ప్రాణాలు కాపాడుకునేందుకు అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాడు.

విషయం తెలుసుకున్న స్నేహితులు, ఆత్మీయులు స్నేహితుడి కోసం నిధులు సేకరించడం మొదలుపెట్టారు. వివిధ గ్రామాలకు చెందిన స్నేహితులకు కూడా విషయం తెలిపారు. ఎవరికి తోచినంత వారు సాయం చేయడంతో మొత్తం 1,79,800 రూపాయలు జమ అయింది. జమ అయిన మొత్తం విరాళాన్ని నేడు మిత్ర బృందం రాజశేఖర్​కు అందించారు. విరాళాల సేకరణకు కృషిచేసిన పెసరు సుధాకర్, చుక్క శంకర్​లను తోటి మిత్ర బృందం అభినందించింది. కష్ట కాలంలో మిత్రులు చూపిన ఔదర్యానికి రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details