తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 8:50 AM IST

ETV Bharat / state

అసత్య ప్రచారాలతో ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్నారు..

రోడ్డు నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారనే భాజపా ఆరోపణలపై చర్చకు సిద్ధమా అంటూ అటవీ శాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్​ ఛైర్మన్ ప్రతాప్​ రెడ్డి సవాల్​ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో చెరువా పూర్​ నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వరకు కేటాయించిన తారు రోడ్డు నిర్మాణం నిధులను తెరాస కాజేసిందనే భాజపా ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ మేరకు గజ్వేల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

forest development corporation chairman press meet in gajwel
అసత్య ప్రచారాలతో ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్నారు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తారు రోడ్డు నిర్మాణం నిధులు రూ.కోటి తెరాస నాయకులు కాజేశారని భాజపా తప్పుడు ప్రచారం చేస్తుందని అటవీ శాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్​ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​ రెడ్డి అన్నారు. నిధులు దుర్వినియోగం చేశారనే దానిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు గజ్వేల్​లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భాజపాపై మండిపడ్డారు.

ఇంకా టెండర్లే పూర్తవలేదు..

నియోజకవర్గంలో చెరువా పూర్ నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయనీ, ఆన్​లైన్​లో టెండర్లకు ఆహ్వానించారని ప్రతాప్​రెడ్డి తెలిపారు. అది ఇంకా టెండర్ దశలోనే ఉందని, పనులు ప్రారంభం కాకుండా బిల్లులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. టెండర్​లో తక్కువ కోడ్​ చేసిన గుత్తేదారులకు అగ్రిమెంట్లు, మేజర్ చెక్​ పూర్తయిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తారని, దీనిపై అవగాహన లేకుండా తెరాసపై భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

ప్రజలే బుద్ధి చెప్తారు

తప్పుడు ప్రచారం చేస్తున్న భాజపా నాయకులపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశామని వంటేరు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్​లోనూ ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉప ఎన్నికలో గెలవాలని చూడటం సిగ్గుచేటన్నారు. అలాంటి వారికి ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్తారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:కాజీపేట- బళ్లార్ష మధ్య మూడో లైన్​ మరో 22 కిమీ పూర్తి

ABOUT THE AUTHOR

...view details