తెలంగాణ

telangana

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

By

Published : Dec 8, 2019, 6:48 PM IST

గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జేసీ పద్మాకర్.... అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

fdc chairmen prateep reddy review meeting  revienue and police officers
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఈనెల 11న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా పలు ప్రగతి పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సమీకృత కార్యాలయ భవనంలో ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జేసీ పద్మాకర్​లు నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్​ అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని సూచించారు. మహతి ఆడిటోరియంలో సీఎం... ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున సమావేశానికి వచ్చేవారికి ముందస్తు పాసులు జారీ చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

ఇదీ చూడండి: మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details