సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కొత్తకోట గ్రామంలో ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పర్యటించారు. పేదలు, వెనకబడిన వర్గాల కోసం తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తున్న బీమా పథకం కార్యకర్తలకు ఎంతో ధీమాగా ఉంటుందని అయన పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన తెరాస కార్యకర్త గుంటూరు శంకర్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలిక ఛైర్మన్ రాజమౌళి, జగదేవ్పూర్ఎంపీపీ బాలేశంగౌడ్, ఆత్మ అధ్యక్షుడు రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం: వంటేరు ప్రతాపరెడ్డి
పేదలు అభ్యున్నతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం పాలిస్తోందని రాష్ట్ర ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. జగదేవపూర్ మండల పరిధి కొత్తపేటలో పర్యటించిన ఆయన కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు తెరాస ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారానికి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం: వంటేరు ప్రతాపరెడ్డి