తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2020, 3:30 PM IST

Updated : Nov 3, 2020, 4:13 PM IST

ETV Bharat / state

ఆరేపల్లిలో మొరాయించిన ఈవీఎం.. మరో మిషన్​తో పోలింగ్

సిద్దిపేట జిల్లా రాయపోల్​ మండలం ఆరేపల్లిలో ఈవీఎం మొరాయించడం వల్ల మరో మిషన్​ ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. టెక్నీషియన్ సిబ్బంది సరిచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడం వల్ల మరో ఈవీఎంను అమర్చారు.

evm mechine trouble in aarepalli siddipeta district
ఆరేపల్లిలో మొరాయించిన ఈవీఎం.. మరో మిషన్​తో పోలింగ్ కొనసాగింపు


సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరేపల్లిలో అరగంటకు పైగా ఈవీఎం మొరాయించింది. ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటర్లు పోలింగ్ బూత్​లోనే నిరీక్షించారు. ఈవీఎంలో తేదీ తప్పుగా ఉండడం వల్ల 465 ఓట్లు పోలైన తర్వాత మిషన్​ ఆగిపోయింది. సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

టెక్నీషియన్ సిబ్బంది వచ్చి సరి చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో వెంటనే ఏజెంట్ల సమక్షంలో మరో ఈవీఎంతో మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ప్రారంభించారు. పోలైన ఓట్ల ఈవీఎంను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేశారు.

ఈ సందర్భంలో కొంతమంది బూత్​ లోపలికి వెళ్లారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెరాస కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపించారు.

ఆరేపల్లిలో మొరాయించిన ఈవీఎం.. మరో మిషన్​తో పోలింగ్

ఇదీ చూడండి:దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్

Last Updated : Nov 3, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details