తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

కరోనా మహమ్మారి రెండోదశ భారత దేశంలోకి రాకుండా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగవంతున్ని ప్రార్థించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సిద్దిపేటలోని మోహిన్‌పురాలోని వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.

By

Published : Dec 25, 2020, 2:12 PM IST

Updated : Dec 25, 2020, 2:20 PM IST

dubbaka mla visited  venkateswara swamy in Siddipet
సిద్దిపేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రజలందరికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని మోహిన్‌పురా ఆలయంలో వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించున్నారు.

దేవుడి ఆశీస్సులతో కరోనా మహమ్మారి రెండోదశ భారత దేశంలోకి రాకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని రఘునందన్ రావు తెలిపారు. నరేంద్ర మోదీ ఆశీస్సులతో వాజ్‌పేయీ‌ జన్మదినం పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ గుడ్ గవర్నెన్స్ అందాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం.. భక్తుల పరవశం

Last Updated : Dec 25, 2020, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details