తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచినీటిని వృథా చేయొద్దు : హరీశ్​రావు

ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. సిద్దిపేట పట్టణంలో తడి, పొడి చెత్త కోసం 38 వేల చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణంలో 22, 23వార్డుల్లో పర్యటించి పలువురికి జనపనార సంచులను పంపిణీ చేశారు.

By

Published : Jan 29, 2020, 6:17 PM IST

Don't waste fresh water minister Harish Rao at siddipet
మంచినీటిని వృథా చేయొద్దు : హరీశ్​రావు

సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి తెస్తున్న మంచినీటిని వృథా చేయవద్దని ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రజలను కోరారు. సిద్దిపేట 22, 23 వార్డుల్లో ఆయన పర్యటించారు. తడి, పొడిచెత్త బుట్టలతో పాటు జనపనార సంచులను పంపిణీ చేశారు.

ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి... ఆరోగ్యం కంటే విలువైనది ఏదీ లేదని పేర్కొన్నారు. జిల్లావాసుల సహకారంతో సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చుకుందామని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరికి లంచం ఇవ్వవద్దని సూచించారు.

మంచినీటిని వృథా చేయొద్దు : హరీశ్​రావు

ఇదీ చూడండి : కామారెడ్డిలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details