తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2019, 11:12 AM IST

ETV Bharat / state

తూకంలో గోల్​మాల్... రేషన్ డీలర్ల ఆందోళన

ప్రభుత్వ గోదాముల నుంచి రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న బియ్యం తూకం తక్కువ వస్తోందని సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు దొమ్మాట రవి ఆరోపించారు. లారీల్లో వచ్చిన బియ్యం డీలర్లకు తూకం వేయకుండా ఇవ్వడం వల్ల భారీగా నష్టపోతున్నామని వాపోయారు.

తూకంలో గోల్​మాల్... రేషన్ డీలర్ల ఆందోళన

తూకంలో గోల్​మాల్... రేషన్ డీలర్ల ఆందోళన

రేషన్ డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో తూకం తక్కువ వస్తోందని సిద్దిపేట జిల్లా రేషన్​ డీలర్ల సంఘం అధ్యక్షుడు దొమ్మాట రవి ఆరోపించారు. బస్తాకు ఒక కిలో బియ్యం తక్కువ తూకం చేసి ఇస్తున్నారని గోదాం ఇంఛార్జి ఆర్య నాయక్​తో డీలర్లు గొడవకు దిగారు. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్​ను డీలర్లు ఫోన్లో సంప్రదించగా విషయం తెలుసుకున్న జేసీ ఆర్య నాయక్ తీరుపై మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details