సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంగానాయక సాగర్ నిర్మాణ పనులు చూసేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వచ్చారు. అకస్మాత్తుగా వీరిపైకి డీసీఎం దూసుకొచ్చింది. ఘటనలో ఒక కార్మికుడు, విద్యార్ధిని మృతి చెందారు. గాయపడ్డ 15 మంది విద్యార్థులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
'దూసుకొచ్చిన మృత్యువు'
విహారం కోసం వెళ్లిన విద్యార్థులను ప్రమాదం వెంటాడింది. రంగనాయక సాగర్ నిర్మాణం పనులు చూసేందుకు వెళ్లిన వారిపై డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది.
డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి