తెలంగాణ

telangana

'రామ మందిర నిర్మాణంలో హిందువులందరూ భాగం కావాలి'

By

Published : Jan 15, 2021, 4:21 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణంలో యావత్​ హిందూ సమాజం పాలు పంచుకోవాలని దత్తక్షేత్ర పీఠాధిపతి శ్రీపాద శర్మ పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ప్రెస్​ క్లబ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో మందిర నిర్మాణ ఆవశ్యకతను తెలిపే కరపత్రాలు, స్టిక్కర్లను ఆయన విడుదల చేశారు.

dattakhsetra peetadhipati call for The Hindu community should be involved in the construction of the Rama Mandir
'రామ మందిర నిర్మాణంలో హిందూ సమాజం భాగస్వామ్యం కావాలి'

అయోధ్య రామమందిర నిర్మాణంలో యావత్ హిందూ సమాజం భాగస్వామ్యం కావాలని దత్తక్షేత్ర పీఠాధిపతి శ్రీపాద శర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట సంచలన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మందిర నిర్మాణ ఆవశ్యకతను తెలిపే కరపత్రాలను, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు.

మందిర నిర్మాణంలో ప్రజలంతా కలిసి రావాలన్న సాధుసంతుల పిలుపు మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో జన జాగరణ చేస్తామని శ్రీపాద శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్​!

ABOUT THE AUTHOR

...view details