తెలంగాణ

telangana

ETV Bharat / state

డప్పు చాటింపుతో లాక్​డౌన్​ హెచ్చరిక - లాక్​డౌన్​ హెచ్చరిక

కరోనా మహమ్మారిపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రజలు బేఖాతరు చేస్తూ ఉండడం వల్ల సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

dappu heralding due to corona lock down at mirudoddi siddipeta
డప్పు చాటింపుతో లాక్​డౌన్​ హెచ్చరిక

By

Published : Mar 24, 2020, 11:38 AM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఈనెల 31 వరకు ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్​ రంగనబోయిన రాములు ప్రజలకు డప్పు చాటింపుతో అవగాహన కల్పించారు.

ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కడైనా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారని వీధివీధి తిరుగుతూ డప్ప చాటింపుతో తెలియజేస్తున్నారు. ప్రజలందరూ సర్కారు ఆదేశాలకు కట్టుబడి వైరస్​ బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

డప్పు చాటింపుతో లాక్​డౌన్​ హెచ్చరిక

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ABOUT THE AUTHOR

...view details